Monday, May 19, 2008

ఎవరికైనా ఈ పద్యం గుర్తుంటే కాస్త సరిచేయండి.

ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు పుస్తకములో చదివిన గుర్తు. నా బుర్రలో అప్పటినంచీ ఈ వాక్యం తిరుగుతోంది. పరభాషా ప్రియత్వంతో మతృభాషని చులకనగా చూసేవాళ్ళమీద వ్యాఖ్యానిస్తూ తెలుగు గురించి వీరేశలింగం పంతులుగారు అనుకుంటా, ఇలా అన్నారు.
మన భాషయే, మకరంద బిందు బృందస్యందన సుందరమగు మాతృభాషయే, మహానందకందోళ సందోహ సంధానతుందిలమగు మాతృభాషయే, నమ్రతకు నమ్రత, కఠినతకు కఠినత, వదలునకు వదలు బిగికి బిగి, జోరునకు జోరు, అన్ని వన్నెలు, అన్ని చిన్నెలు, అన్ని హొయలు, అన్ని వయ్యారములు కలిగిన భాషయే....
ఇంకా చాలా ఉండాలి. మర్చిపొయా.. ఎవరికైనా సరిగ్గా గుర్తుంటే కాస్త సరిచేయండి.

-------------------

ఈ రొజు ఇంకాస్త గట్టిగా వెదికితే ఇక్కడ (http://ourtextbooks.blogspot.com/2006/02/textbook_114082693613147526.html)

ఈ వచనం ఇంకాస్త దొరికింది. అది అన్నది పానుగంటి లక్ష్మీనరసిం హారావుగారంట.