Monday, May 19, 2008

ఎవరికైనా ఈ పద్యం గుర్తుంటే కాస్త సరిచేయండి.

ఎప్పుడో చిన్నప్పుడు తెలుగు పుస్తకములో చదివిన గుర్తు. నా బుర్రలో అప్పటినంచీ ఈ వాక్యం తిరుగుతోంది. పరభాషా ప్రియత్వంతో మతృభాషని చులకనగా చూసేవాళ్ళమీద వ్యాఖ్యానిస్తూ తెలుగు గురించి వీరేశలింగం పంతులుగారు అనుకుంటా, ఇలా అన్నారు.
మన భాషయే, మకరంద బిందు బృందస్యందన సుందరమగు మాతృభాషయే, మహానందకందోళ సందోహ సంధానతుందిలమగు మాతృభాషయే, నమ్రతకు నమ్రత, కఠినతకు కఠినత, వదలునకు వదలు బిగికి బిగి, జోరునకు జోరు, అన్ని వన్నెలు, అన్ని చిన్నెలు, అన్ని హొయలు, అన్ని వయ్యారములు కలిగిన భాషయే....
ఇంకా చాలా ఉండాలి. మర్చిపొయా.. ఎవరికైనా సరిగ్గా గుర్తుంటే కాస్త సరిచేయండి.

-------------------

ఈ రొజు ఇంకాస్త గట్టిగా వెదికితే ఇక్కడ (http://ourtextbooks.blogspot.com/2006/02/textbook_114082693613147526.html)

ఈ వచనం ఇంకాస్త దొరికింది. అది అన్నది పానుగంటి లక్ష్మీనరసిం హారావుగారంట.

4 comments:

oremuna said...

అది పద్యం కాదు, వచనం. వ్రాసింది సాక్షి.

oremuna said...

రూనాకు గుర్తున్నంత వరకు "వ్యాసమునకు, కవిత్వమునకు , గానమునకు " సంపూర్ణార్హత గల భాష :)

P S Ravi Kiran said...

కిరణ్ గారూ కృతజ్ఞతలు.
ఈ రొజు ఇంకాస్త గట్టిగా వెదికితే ఇక్కడ ఈ వచనం ఇంకాస్త దొరికింది.
విజయ్ గారు తెలుగు ఫాంటు ఉపయోగించలేదు కాబట్టి జాలంలో వెదికితే దొరకలేదు.

Unknown said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site manalati bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.